18, ఆగస్టు 2010, బుధవారం

ఇస్లాం మతం


ఏకేశ్వరవాద ప్రాతిపదిక పైన ముహమ్మద్ ఏడవ శతాబ్దంలో స్థాపించిన ఒక మతము. 140 నుండి 180 కోట్ల జనాభాతో క్రైస్తవం తరువాత ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం[1].

ఇస్లాం అనునది మతము, ముస్లిం అనగా ఇస్లాం మతావలంబీకుడు.

ఇస్లాం అనే పదానికి మూలం అరబీ భాషాపదం 'సలెమ', అనగా శాంతి, స్వఛ్ఛత, అర్పణ, అణకువ మరియు సత్ శీలత. ధార్మిక పరంగా చూస్తే ఇస్లాం అనగా భగవదేఛ్ఛకు అర్పించడం మరియు అతడి ధర్మానికి అనుగుణంగా నడచుకోవడం. ముస్లిం అనగా భగవదేఛ్ఛకు లోబడి, స్వయాన్ని భగవంతుడికి అప్పగించేవాడు, శాంతి కాముకుడు, శాంతి స్థాపకుడు. మహమ్మద్ ప్రవక్త ప్రవచించిన మార్గాన్ని, ధర్మాన్ని అవలంబించువాడు. ముస్లిం లకు పరమ పవిత్రం దేవుని (అల్లాహ్) వాక్కు, ఆదేశము ఖురాన్, మరియు మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు/ఉల్లేఖనాలు హదీసులు. అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. ముహమ్మద్ చివరి ప్రవక్త.




విషయ సూచిక :-----------

1 ఇస్లాం ఐదు మూలస్థంభాలు
2 విశ్వాసము
3 అల్లాహ్
4 ఖురాన్
5 మలాయిక (దేవదూతలు)
6 ముహమ్మద్ ప్రవక్త
7 ఆచరణీయాలు
8 ప్రళయాంతము
9 మోక్షము
10 చరిత్ర
10.1 ఖిలాఫత్ ప్రారంభం (632–750)
11.1 జనగణన
11.2 మసీదులు
11.3 కుటుంబ జీవితం
11.4 కేలండర్
12 ఇతర మతములు
13 విభాగాలు
13.1 సున్నీ
13.2 షియా
13.3 సూఫీ తత్వము
13.4 ఇతరములు


ఇస్లాం ఐదు మూలస్థంభాలు:---

ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం, భగవంతుడు (అల్లాహ్) తన ఆఖరి ప్రవక్త ముహమ్మద్ ను ఉపదేశకుడుగా పంపాడు, ఖురాను (పవిత్ర గ్రంథం) అవతరింపజేశాడు. ఇస్లాం ఐదు మూలస్థంభాలు 1. షహాద (విశ్వాసం), 2. సలాహ్ (నమాజ్ లేదా ప్రార్థన), 3. సౌమ్ (ఉపవాసం), 4. జకాత్ (దాన ధర్మం), 5. హజ్ (పుణ్య యాత్ర).


విశ్వాసము:--

ఖురాను ప్రకారం ప్రతి ముస్లిం అల్లాహ్, అవతరింపబడ్డ గ్రంధాలు , దేవదూతలు, ప్రవక్తలు, ప్రళయదినం పై విశ్వాసం వుంచవలెను. హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) ప్రవక్తలు అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన కలదు. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ ఈశ్వరుడు (అల్లాహ్) ప్రవక్తలను అవతరింపజేశాడు. ప్రతి ప్రవక్త ఈశ్వరుడి (అల్లాహ్) హెచ్చరికలను ప్రజానీకానికి చేరవేస్తాడు. ప్రతి ప్రవక్తకాలంలోని ప్రవక్తల అనుయాయులందరూ ముస్లిములే, కాని క్రొత్త ప్రవక్త అవతరించినచో అతడిని అవలంబించవలసి యుంటుంది. ఉదాహరణకు ఇబ్రాహీం ప్రవక్త (అబ్రహాము) అనుయాయులు ఇస్మాయీల్, ఇస్ హాఖ్ లను అవలంబించారు. వీరి అనుయాయులు (మోషే) ను అవలంబించారు. వీరి అనుయాయులు (యేసు) ను అవలంబించారు. ఇది ప్రవక్తల గొలుసుక్రమం. వీరందరూ ఈ క్రమంలోని అంతిమ ప్రవక్త అయిన మహమ్మదు ను అవలంబించవలెను. ఈ విశ్వాసం గలవారే ముస్లింలు. ఈవిధంగా విశ్వాసం (ఈమాన్) వుంచేవారిని విశ్వాసులు లేక మోమిన్ (ఆస్తికులు) అని, అవిశ్వాసులను కాఫిర్ (నాస్తికులు) లేక తిరస్కారులు అని అంటారు.



అల్లాహ్:--

అల్లాహ్ ఆ సర్వేశ్వరుడి నామం. సకల చరాచర జగత్తును సృష్టించిన మహాసృష్టికర్త. ఇస్లాం లో ఏకేశ్వరోపాసన కఠోర నియమము. అల్లాహ్ పై విశ్వాసప్రకటనను షహాద అని, మరియు ఏకేశ్వర విశ్వాసాన్ని తౌహీద్ అంటారు. అల్లాహ్ యొక్క 99 విశేషణాత్మక నామవాచకాలు కలవు. ముస్లింలు భగవన్నామస్మరణ చేయునపుడు ఈనామాలన్నీ స్మరిస్తారు.



ఖురాన్:---

అల్లాహ్ చే జిబ్రయీల్ దేవదూత ద్వారా మహమ్మద్ ప్రవక్త పై అవతరింప బడ్డ దైవగ్రంథం ఈ ఖురాన్. క్రీ.శ. 610 - 632 ల మధ్య మక్కా మరియు మదీనా లో అవతరింపబడినది. ఖురాన్ అనగా పఠించడం.

ఇందులో

30 పారాలు లేక 'జుజ్'లు గలవు.
114 సూరాలు గలవు
6,236 ఆయత్ లు గలవు.
మక్కా లో అవతరింపబడిన సూరాలను మక్కీ సూరాలు అని, మదీనా లో అవతరింపబడిన సూరాలను మదనీ సూరాలు అని అంటారు. మొదటి ఖలీఫా అయిన అబూబక్ర్ కాలంలో వీటినన్నిటినీ క్రోడీకరించి ఒక గ్రంధరూపాన్నిచ్చారు. ఖురాన్ ను కంఠస్తం చేసినవారిని హాఫిజ్-అల్-ఖురాన్ అంటారు. ఖురాన్ గ్రంథంలో భగవంతుని (అల్లాహ్), ఆదేశాలు, హితోక్తులు, విశ్వసృష్టి, మానవసృష్టి, మానవజీవన చరిత్ర, దైవమార్గం అనుసరించినవారి విజయాలు, అనుసరించనివారి వినాశనాలు, మానవజాతి కొరకు ప్రకృతినియమాలు, సద్బోధనలు గలవు. ఇస్లామీయ ప్రభుత్వాలు గల దేశాలలో ఖురాన్ ఆదేశాల ప్రకారం చట్టాలు నడుపబడుచున్నాయి.



[మార్చు] మలాయిక (దేవదూతలు):--

దేవదూతకు అరబ్బీలో మలక్ అని పర్షియన్ లో ఫరిష్తా అని, బహువచనంలో మలాయిక 'ఫరిష్తే' అని అంటారు. దేవదూతలలో ముఖ్యులు నలుగురు. 1. జిబ్రయీల్, 2. మీకాయీల్, 3. ఇజ్రాయీల్, 4. ఇస్రాఫీల్.



ముహమ్మద్ ప్రవక్త:--

ముహమ్మద్ ప్రవక్త, ప్రవక్తల గొలుసుక్రమంలోని ఆఖరు ప్రవక్త. ఇస్లాం ప్రవక్తల గొలుసు ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమైనది, ఇస్లాం ఆదమ్ తోనే స్థాపింపబడినది. ఇస్లాం ప్రవక్తలలో ఆఖరి ప్రవక్త ముహమ్మద్. క్రీ.శ. 570 ఏప్రిల్ 20 న మక్కా నగరంలో జన్మించారు. తండ్రి 'అబ్దుల్లా' తల్లి 'ఆమినా'. తన 40 యేట వరకూ సాధారణ జీవితం గడిపిన ముహమ్మద్ ప్రవక్తకు, హిరా గుహ యందు ధ్యానంలో యుండగా జిబ్రయీల్ దూత ప్రత్యక్షమై అల్లాహ్ ఆదేశాలను మరియు ఖురాన్ యొక్క మొదటి సూరా ను అవతరింపజేశారు. ఈ సూరా 'ఇఖ్రా బిస్మి రబ్బుకల్లజి ఖలఖ్' అనే ఆయత్ తో ప్రారంభమైనది. దీనర్థం "(ఇఖ్రా) చదువు, అల్లాహ్ (పరమేశ్వరుడు) ఒక్కడేనని, అతడే సర్వాన్నీ సృష్టించాడని....'. ఈ అవతరణ పొందిన ముహమ్మద్ తన ప్రవక్త జీవితం ప్రారంభించారు. బహుఈశ్వరాధకులైన అరబ్ పాగన్లు ఇతన్ని నానా కష్టాలు పెట్టారు. క్రీ.శ. 622 లో మక్కా నుండి మదీనా కు హిజ్రత్ (వలస) వెళ్ళారు. ఈ సంవత్సరం నుండే ఇస్లామీయ కేలండర్ ఆరంభమైనది. మదీనా లో స్థిరపడిన ముహమ్మద్ కు మక్కా వాసులనుండి అగచాట్లు తప్పలేదు. ఇస్లామీయ రీతి నచ్చని మక్కావాసులు మదీనా వాసులపై అనేక యుద్దాలు చేశారు. ఈ యుద్ధాలకు నాయకత్వం వహించిన ముహమ్మద్ ఒకటీ రెండూ యుద్ధాలు తప్ప అన్నింటిలోనూ విజయాలను చవిచూసారు. ఆఖరుకు ముస్లిం సమూహాలు మక్కానూ రక్తపాత రహితంగా కైవసం చేసుకున్నారు. క్రీ.శ. 632 లో ముహమ్మద్ ప్రవక్త పరమదించారు. ముహమ్మద్ ప్రవక్త ఆచరణలను సున్నహ్ అనీ ఉపదేశాలను హదీసులు అనీ వ్యవహరిస్తారు. ఖురాన్ ఆదేశాల తరువాత సున్నహ్ మరియు హదీసులే ముస్లింలకు ప్రామాణిక ఆదేశాలు.


ఆచరణీయాలు:--

ఇస్లామీయ ప్రపంచం లేదా ప్రపంచంలోని ముస్లింలు ఖురాన్, షరియా మరియు హదీసులను ఆచరిస్తారు. ముస్లింల సాంప్రదాయాలు వీటినుండి ఉద్భవించినవే. ముస్లింల ఆచారాలు, ముస్లిం సాంప్రదాయాల నుండి మరియు ప్రాదేశిక ఆచార వ్యవహారాలనుండి ఉద్భవించినవి.


ప్రళయాంతము:--

ఒకానొక రోజు సర్వసృష్టీ అంతమగును. ఆ రోజునే ఇస్లాం లో యౌమ్-అల్-ఖియామ (అరబ్బీ : يوم القيامة) (ఉర్దూ : ఖయామత్)అర్థం 'ప్రళయాంతదినం', సృష్టి యొక్క ఆఖరి రోజు. ఖయామత్ పై విశ్వాసముంచడాన్ని అఖీదా అంటారు. ఖయామత్ గురించి ఖురాన్ లోను, హదీసుల లోనూ క్షుణ్ణంగా వర్ణింపబడినది. ఉలేమాలు అయిన అల్-ఘజాలి, ఇబ్న్ కసీర్, ఇబ్న్ మాజా, ముహమ్మద్ అల్-బుఖారి మొదలగువారు విశదీకరించారు. ప్రతి ముస్లిం మరియు ముస్లిమేతరులు తమ తమ కర్మానుసారం అల్లాహ్ చే తీర్పు చెప్పబడెదరు - ఖురాన్ 74:38. ఖురానులో 75వ సూరా అల్-ఖియామ పేరుతో గలదు.


మోక్షము:--

ముస్లింలు ఖురాన్, షరియా, మరియు హదీసుల ప్రకారం నడుచుకుంటూ, అల్లాహ్ కు తమవిధేయతను ప్రకటించి, సన్మార్గంలో నడచినప్పుడే మోక్షము కలుగుతుంది. ఈ మోక్షాన్నే ముస్లింలు మగ్ ఫిరత్ అంటారు. ఈ మగ్ ఫిరత్ పొందినవారే స్వర్గం (జన్నత్) లో ప్రవేశిస్తారు.


చరిత్ర:--


ఇస్లామీయ చారిత్రక పురోగతి వలన, ఇస్లామీయ ప్రపంచం అంతర్ మరియు బాహ్య ప్రపంచంలో రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాలలో ఎంతో మార్పు వచ్చింది. ముహమ్మద్ ప్రవక్త ఖురాన్ పఠించిన ఓ వందేళ్ళ కాలంలోనే పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం నుండి తూర్పున మధ్య ఆసియా వరకూ ఇస్లామీయ సామ్రాజ్యం వ్యాపించింది. ఈ క్రొత్త రాజకీయ స్థితులు, ప్రజాయుద్ధాలను లేవదీసి క్రొత్త రాజ్యాలు ఏర్పాటయేలా చేసింది. ఈ క్రొత్త రాజ్యాల మధ్య దారితీసిన యుద్ధాలలో వెలుపలి దేశాల సహాయాలు కూడా పొందాయి. ఇస్లామీయ సామ్రాజ్యం ఆఫ్రికా,భారత ఉపఖండం మరియు తూర్పు ఆసియా దేశాలలోనూ విస్తరించింది. ఇస్లామీయ నాగరికత మధ్య యుగం లో అభివృద్ధి చెందిన నాగరికతగా వెలసిల్లింది. కాని యూరప్ దేశాలలో ఆర్థిక సైనిక పురోగతివలన, అంతగా వ్యాప్తి చెందలేక పోయింది. 18వ మరియు 19వ శతాబ్దాలలో, ఇస్లామీయ రాజ్యాలు ఉదాహరణకు ఉస్మానియా సామ్రాజ్యం, మొఘల్ సామ్రాజ్యం మొదలగునవి యూరప్ రాజరిక వ్యవస్థ కబంధ హస్తాలలోకి వెళ్ళాయి. 20వ శతాబ్దంలో ఇస్లామీయ పునరుజ్జీవనం మరియు ఆర్థిక పురోగతుల మూలంగా ఇస్లామీయ ప్రపంచం పునరుజ్జీవనం మరియు అంత॰కలహాలకు గురైంది.[2]



ఖిలాఫత్ ప్రారంభం (632–750):--


హిజ్రీ శకానికి ముందు, ముహమ్మద్ ప్రవక్త, మక్కా నగరంలో తన ప్రవచనాలను బోధించసాగారు. మదీనా నగరానికి హిజ్రత్ చేసిన తరువాత, అచటనుండి అరేబియా అంతటినీ ఏకీకృతం చేశారు. క్రీ.శ. 632 లో ముహమ్మద్ ప్రవక్త మరణం తరువాత, ముస్లిం సమూహాలలో ఆందోళనలు బయలు దేరాయి. ముహమ్మద్ ప్రవక్త ఉన్నంతకాలము ముస్లింలందరూ సమిష్టిగా ప్రవక్తగారి ఆధ్వర్యంలోని నాయకత్వాన్ని అంగీకరించారు. వీరి తరువాత నాయకుడెవ్వరనే ప్రశ్న తలెత్తింది. ఈ ఆందోళణకు కారణం అదే. ముఖ్యమైన సహాబాలు మరియు అనేక తెగల నాయకులందరూ కలసి అబూబక్ర్ ను తమ నాయకునిగా అనగా ఖలీఫాగా ఎన్నుకున్నారు. ముహమ్మద్ ప్రవక్త జీవించి యున్నపుడు వారి అభీష్టం కూడా, వారి తరువాత అబూబక్ర్ ముస్లింల నాయకుడు కావాలని. ఈ విషయమెరిగిన సహాబాలు, ప్రధానంగా ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ అబూబక్ర్ ను తమ నాయకునిగా ప్రకటించారు. ఆనాటి 'ఖారిజీలు' అబూబక్ర్ నియామకం పట్ల తమ నిరసనను ప్రకటించారు. (ఈ ఖారిజీలు ప్రతి నిర్ణయాన్నీ విమర్శించేవారు. ముహమ్మద్ ప్రవక్త తన జీవనకాలంలో, తన అనుయాయులకు, వీరి పట్ల అప్రమత్తంగా వుండండి, రాబోయే ఫిత్నాలకు వీరే కారణభూతులౌతారని సెలవిచ్చారు.) ముహమ్మద్ ప్రవక్త వారసునిగా, వారి అల్లుడైన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ను ఖలీఫాగా ఎన్నుకోవాలని గళం విప్పారు. కాని వీరికి సంఖ్యాబలం లభించలేదు. ఇంకొక ప్రధాన విషయం 'అలీ' స్వయంగా తన మద్దతును అబూబక్ర్ కు ప్రకటించి, ఖారిజీల గళాన్ని బలంలేకుండా చేశారు. అబూబక్ర్ ముందు తక్షణ కర్తవ్యంగా, బైజాంటియన్ (తూర్పు రోమన్ సామ్రాజ్యం) లను నిరోధించడం, వీటి కొరకు యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఈ యుద్ధాలకు రిద్దా యుద్ధాలు అని వ్యవహరించారు.[3]


750 లో ఖిలాఫత్ ప్రాంతం.634 లో అబూబక్ర్ మరణం తరువాత, ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ ఖలీఫాగా ఎన్నికయ్యాడు. ఇతని తరువాత ఉస్మాన్ మరియు అలీ ఇబ్న్ అబీ తాలిబ్ లు ఖలీఫాలయ్యారు. ఈ నలుగురికీ రాషిదూన్ ఖలీఫాలు లేదా మార్గదర్శకం గావింపబడ్డ ఖలీఫాలు అని వ్యవహరిస్తారు. వీరి కాలంలో ముస్లింల రాజ్యం బైజాంటియన్ మరియ్ పర్షియన్ సామ్రాజ్యం వరకూ వ్యాపించినది.[4] ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ 644 లో షహీద్ అయిన తరువాత, ఉస్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ ఖిలాఫత్ వారసుడిగా ప్రకటింపబడ్డారు. ఇతను అనేక సవాళ్ళను వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు. 656 లో ఇతనూ షహీద్ గావింపబడ్డారు, అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఖలీఫాగా ఎన్నికయ్యారు. ఇతని కాలంలో మొదటి ఫిత్నా (ఖలీఫాల పట్ల తిరుగుబాటు) బయలుదేరింది. ఖారిజీలు 661లో 'అలీ'ని బలిగొన్నారు. వీరి తరువాత ముఆవియా ఖలీఫాగా ఎన్నికయ్యారు. ముఆవియా ఉమయ్యద్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.[5] ఈ ఖలీఫా విషయాల మూలంగా ముస్లిం సమాజంలో షియా తత్వం బయలుదేరి వర్గ విభజన జరిగినది. అలీ ఖిలాఫత్ కు ముందు ఉన్నటువంటి ముగ్గురి ఖలీఫాలను ఖలీఫాలుగా స్వీకరించినవారు సున్నీ ముస్లింలయ్యారు. నిరాకరించినవారు కొద్ది సంఖ్యలో గలవారు షియాలుగా వేరు పడ్డారు.[6] 680 లో ముఆవియా మరణించిన తరువాత, ఖలీఫా వారసుల గూర్చి తిరిగీ తర్జన భర్జనలు జరగసాగాయి, ఇవి తిరిగీ తిరుగుబాట్లవరకూ తీసుకెళ్ళాయి, దీనినే "రెండవ ఫిత్నా" గా వ్యవహరిస్తారు. ఈ తరువాయి ఉమయ్యద్ సామ్రాజ్యం 70 యేండ్లపాటు సాగింది. ప్రాంతాలైన మగ్రిబ్ (పశ్చిమం) మరియు అల్-అందులుస్ ( ఇబీరియన్ ద్వీపకల్పం ), ప్రాచీన విసిగోథిక్ హస్పానియా (స్పెయిన్)) మరియు పశ్చిమ ప్రాంతాలైన నర్బోనీస్ గాల్ ద్వారా సింధ్ ప్రాంతం, మధ్య ఆసియా మొదలగునవి ముస్లింల వశమయ్యాయి. [7] ఈ కాలంలోనే ముస్లిం-అరబ్బులు ప్రాపంచిక విషయాలపై ప్రశ్నలు లేవనెత్తారు వీరినే జాహిద్ లు గా వ్యవహరిస్తారు. ధార్మికులైన వారికి ప్రపంచ విషయాల పరిత్యాగమే ఉత్తమమని హసన్ బస్రి ఓ ఉద్యమాన్ని లేవదీశాడు. క్రమేపీ ఈ ఉద్యమం సూఫీ తత్వం అవతంచడానికి దోహదపడింది. [8]

ఈ ఉమయ్యద్ ల నిరంకుశం మూలంగా, ఇస్లాం కేవలం అరబ్బులకు మాత్రమే మతము గా భావింపబదినది. [9] ఈ ఉమయ్యద్ ల విత్తము, ముస్లిమేతరులైన జిమ్మీల పన్నులరూపంలో వసూలయ్యే మొత్తాలపైనే ఆధారపడినది. ఒక ముస్లిమేతరుడు ఇస్లాంలోకి ప్రవేశించాలంటే, ముందు అరబ్బులవద్ద సరకులు కొనేవాడి (గాహక్) గా మారే పరిస్థితి వుండేది. ఇస్లాంలో ప్రవేశించిననూ వీరికి అధములుగా కొన్ని అరబ్ సమూహాలు చూసేవి. ఈ 'నవముస్లిం' మవాలీ అని సంబోధించేవారు. ఈ మవాలీలు ఇస్లాం ప్రసాదించే సంపూర్ణ స్వాతంత్ర్యాలు పొందలేక పోయేవారు. ఈ వ్యవహారం నచ్చని ముహమ్మద్ ప్రవక్త పినతండి అబ్బాస్ ఇబ్న్ అబ్ద్ ముత్తలిబ్ వారసులు వ్యతిరేకించి అబ్బాసీయ సామ్రాజ్యాన్ని క్రీ.శ. 750 లో స్థాపించారు. [10] ఈ అబ్బాసీయుల కాలంలో ఇస్లామీయ సామ్రాజ్యం వేగంగా అభివృద్ధి చెంది ఇస్లామీయ స్వర్ణయుగానికి నాంది పలికింది. ఈ సామ్రాజ్యానికి రాజధాని బాగ్దాద్ నగరం. [11]



స్వర్ణయుగం (750–1258):--


.9వ శతాబ్దం ఆఖరువరకు, అబ్బాసీ ఖలీఫాలు, తమ సామ్రాజ్యాన్ని పటిష్టపరచుకున్నారు. వీరి సామ్రాజ్యం, ఉత్తర ఆఫ్రికా, పర్షియా మరియు మధ్యాసియా లోని అనేక చిన్న చిన్న రాజ్యాలు ఏకీకృతమైనవి. ఏకేశ్వరవాదమూ వీరి సామ్రాజ్యవిస్తరణకు పనికొచ్చింది, ఈ విధంగా వీరి సామ్రాజ్యం విస్తరించి విశాలమైన ముస్లిం ప్రపంచం ఏర్పడడానికి దోహదపడింది. ఖలీఫాల మతపరమైన విధివిధానాలలో షియాలైన ఫాతిమిద్ ల ఆధిపత్యం ప్రగాఢంగా తన ప్రభావాన్ని చూపించింది. క్రీ.శ. 1055 లో సెల్జుక్ తుర్కులు అబ్బాసీయుల సైనికాధిపత్యాన్ని తొలగించగలిగారు, ఖలీఫాలను మాత్రం గౌరవిస్తూనే వచ్చారు.[12] వీరి సామ్రాజ్య విస్తరణ రెండువిధాల సాగినది, ఒకతి శాంతిపరమైన మార్గం దావాహ్, రెండవది యుద్ధాలు. మూడవ విధం, వీరు సాగించిన వర్తకాలు. వీరు వర్తకాలు చేసే ప్రాంతాలలో నివాసాలు ఏర్పరచుకోవడం మరియు "దావాహ్" (ఇస్లాం మార్గంలో ధార్మిక పిలుపు) ను ఆచరించడం. వర్తకాలు సాగించి సామ్రాజ్యాల విస్తరణలు గావించిన ప్రాంతాలలో ఉప-సహారా పశ్చిమ ఆఫ్రికా, మధ్యాసియా, వోల్గా బల్గేరియా మరియు మలయా ద్వీపసమూహాలు.[13] ఈ స్వర్ణయుగం, కొత్త న్యాయ, తత్వ, మరియు ధార్మిక పురోగతులను చవిచూసింది. ఆరు ప్రముఖ హదీసుల క్రోడీకరణలు చేపట్టబడ్డాయి. నాలుగు ఇస్లామీయ పాఠశాల (మజహబ్)లు ప్రవేశపెట్టబడినాయి. ఇస్లామీయ చట్టాలు క్రోడీకరించి గ్రంధాలరూపమివ్వబడ్డాయి. 9వ శతాబ్దానికి చెందిన ఇమామ్ అల్ షాఫయీ హదీసుల క్రోడీకరణలకు సూత్రాలు ప్రతిపాదించాడు. ఆవిధంగా హదీసు క్రోడీకరణలకు మార్గం ఇంకనూ సులభమయ్యింది. ఈ సూత్రీకరణల ద్వారా ఇస్లామీయ పండితులలో తర్జనభర్జనలు తగ్గుముఖం పట్టాయి.

మసీదులు:--


మస్జిద్ లేదా మశీదు, ముస్లింల ప్రార్థనా ప్రదేశం, మసీదుకు అరబ్బీ నామం మస్జిద్. చిన్న చిన్న మస్జిద్ లు వుంటే అవి సాధారణ మస్జిద్, పెద్ద పెద్ద సమూహాల కొరకు మరీ ముఖ్యంగా శుక్రవారపు ప్రార్థనల కొరకు కేంద్రీయ మస్జిద్ లను 'జామా మస్జిద్' లేదా 'మస్జిద్ ఎ జామి' అని అంటారు. ప్రాధమికంగా ఈ మస్జిద్ లు ప్రార్థనా మందిరాలైనప్పటికీ, వీటిలో సామాజిక కార్యకలాపాలైన పాఠశాలలు, మదరసాలు సామాజిక కేంద్రాలు, మొదలగువాటి కొరకునూ ఉపయోగిస్తున్నారు. ఈ మస్జిద్ లకు మీనార్లు గుంబద్ లు, మిహ్రాబ్, మింబర్, వజూ ఖానాలు మొదలగునవి వుంటాయి.


కుటుంబ జీవితం:--


ఇస్లామీయ సమాజంలో మూలవ్యవస్థ విషయం "కుటుంబం", మరియు ఇస్లామ్ ఈ కుటుంబ సభ్యులందరికీ తగురీతిలో హక్కులను కల్పిస్తున్నది. కుటుంబ వ్యవస్థలో యజమాని 'తండ్రి', ఇతను కుటుంబపు బరువుబాధ్యతలు, ఆర్థిక విషయాలను, ఆలన పాలన పోషణలు చూస్తాడు. ఖురాన్ లో వారసత్వపు విషయాలన్నీ క్షుణ్ణంగా పొందుపరచబడ్డాయి. కుటుంబంలోని ఆస్తిలో స్త్రీహక్కు, పురుషుడి హక్కుతో సమానం. అనగా సగం ఆస్తి స్త్రీకి చెందుతుంది. అన్ని హక్కులూ సగం కల్పించబడ్డాయి.[44] ఇస్లాంలో పెళ్ళి లేదా నికాహ్ అనునది, పౌర-ఒడంబడిక. ఈ నికాహ్ కొరకు, ఇద్దరు సాక్షులు అవసరం. పెళ్ళికొడుకు పెళ్ళికుమార్తెకు భరణం "మహర్" చెల్లించాలి. మహర్ అనునది, పెళ్ళికుమారిడి తరపున పెళ్ళికుమార్తెకు ఓ బహుమతి. ఈవిషయం "నికాహ్ నామా"లో వ్రాయవలసి యుంటుంది.[45]

ఓ పురుషుడు నలుగురు భార్యలను గలిగి వుండవచ్చును. కానీ వీరికి సమాన హక్కులు పోషించగలిగే స్థితిమంతం పురుషుడు కలిగి వుండాలి. స్త్రీ ఒక పురుషుడిని మాత్రమే భర్తగా కలిగి వుండాలి. భర్తతో విడాకులు పొంది ఇంకో పెళ్ళి చేసుకొనవచ్చును. ఇస్లాంలో విడాకులుకు "తలాఖ్" అని వ్యవహరిస్తారు.[46] స్త్రీలు హిజాబ్ లేదా పరదా పద్దతిని పాటించాలి. దీనినే "ఘోషా" పద్దతి అని వ్యవహరిస్తారు, ఈ పద్దతి స్త్రీలను హుందాగా జీవించేందుకు దోహదపడుతుందని భావిస్తారు. ఈ నియమం పై పలు పండితుల వాగ్వివాదాలున్నాయి, విమర్శలూ, అంగీకారాలూ రెండునూవున్నది. కానీ అంగీకారాల శాతం బహు ఎక్కువ. నగర ప్రాంతాలలో ఈ ఘోషాపద్దతి కొద్ది తక్కువ కాన వస్తుంది

కేలండర్:--

ఇస్లామీయ కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో మరియు ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు మరియు దాదాపు 354 దినాలు గలవు. "హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త మరియు అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు క్రీ.శ. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.

సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరం గా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638 లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగినది


ఇతర మతములు:--


ఇస్లామీయ ధర్మశాస్త్రాల అనుసారం, ఇస్లాం, మానవకళ్యాణం కొరకు అల్లాహ్ చే ప్రసాదింపబడిన ఓ సరళమైన శాంతిమార్గం, ఈ మార్గం ఆదమ్ ప్రవక్త తో ప్రారంభమైనది.[49] చరిత్ర గతిలో ఈ ప్రామాణిక క్షీణించే దశలలో అల్లాహ్, ప్రజలకొరకు, తన ప్రవక్తలను అవతరింపజేస్తూ వచ్చాడు. [50] ఈ సిద్ధాంతం ప్రకారం ఇబ్రాహీం, మూసా, బనీ ఇస్రాయీల్ (హిబ్రూ జాతి) ప్రవక్తలు, వీరందరూ ఇస్లామీయ ప్రవక్తలే. ఇంకనూ ఈసా, ముహమ్మద్ ప్రవక్త, దైవసందేశాలను మోసుకొచ్చినవారే.[51][52] [53]

ఇస్లామీయ చట్టాలు ముస్లిమేతరులకు వివిధ వర్గాలలో విభజించారు, ఈ విభజనలకు మూలం ఇస్లామీయ రాజ్యాలతో ముస్లిమేతరుల సంబంధాలు. ఇస్లామీయ రాజ్యాలలో నివసించే యూదులు మరియు క్రైస్తవులకు జిమ్మీలు ("సంరక్షించబడిన ప్రజలు (protected peoples)") అని వర్గీకరించాలు. ఈ వర్గీకరణ ఒడంబడిక మూలంగా ఈ జిమ్మీల మతపరమైన, సామాజిక, ఆస్తిసంబంధ మరియు ఆర్థిక సంరక్షణ , ఇస్లామీయ ఖలీఫాలు లేదా రాజుల భుజస్కంధాలపై యుండేది. ఈ సంరక్షణ ప్రతిఫలంగా వీరి నుండి జిజియా పొందేవారు. ఈ విధమైన వ్యవస్థవలన జిమ్మీలు అన్ని రకములైన స్వేచ్ఛను పొందేవారు


విభాగాలు:----------------------------

ఇస్లాంలోని సమూహాలకు ఐదు మూలస్థంభాలపై ఎలాంటి తకరారు లేకపోయినప్పటికీ, అనేక ఇతర విషయాలపై తర్జనభర్జనలకు లోనై, అనేక విభాగాలుగా విడిపోయారు. ఇందులో ప్రధానమైనవి సున్నీ ఇస్లాం, మరియు షియా ఇస్లాం లు. ప్రపంచంలో సున్నీ ముస్లింలు దాదాపు 85% ఉండగా షియాముస్లింలు 15% గలరు.[61]




సున్నీ:--

సున్నీ ముస్లింలు ఇస్లామీయ సమూహంలో అతి పెద్ద సమూహం. ఇస్లామీయ జనాభాలోని 85% ఈ సున్నీ ముస్లింలే. అరబ్బీ భాషలో 'సున్నీ' అనగా, మార్గం లేదా దారి. ముహమ్మద్ ప్రవక్త ఆచరణీయాలను అమలు చేయువారు సున్నీలు. ఈ సున్నీ ముస్లిం సమూహం, రాషిదూన్ ఖలీఫాల పట్ల తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తారు. (షియాలు ఇందుకు విరుద్ధం). ఈ సున్నీ ముస్లిం సమూహం మరియూ నాలుగు పాఠశాలలో విభజింపబడినది. ఈ సున్నీ పాఠశాలలనే మజహబ్ అని అంటారు. ఈ పాఠశాలలు హనఫీ, షాఫయీ, మాలికీ మరియు హంబలీ పాఠశాలలు.[62]


షియా:--

ఇస్లాంలో షియా ఇస్లాం లేదా 'షియా' అనునది ఒక శాఖ. వీరు సున్నీల తరువాత పెద్ద సంఖ్యలో గలరు. ముహమ్మద్ ప్రవక్త కాలంనుండే వీరు ప్రత్యేక వర్గంగా వుంటూ వచ్చారు. వీరు మహమ్మద్ ప్రవక్తపై విశ్వాసముంచరు అనే అపవాదు ఉన్నది. కాని ఇది నిజంగాదు. వీరు అహ్లె బైత్ అనగా ప్రవక్తగారి కుటుంబం పట్ల ఎక్కువగా తమ ప్రేమాభిమానాలు చాటుతారు. సున్నీలకు షియాలకు ప్రధాన తేడా, సున్నీలు ప్రధానంగా సున్నహ్ పట్ల తమ జీవితాలను ప్రతిబింబించేలా చూసుకుంటారు. షియాలు సున్నహ్ పట్ల అంతగా ప్రగాఢ విశ్వాసం ప్రకటించరు. షియాలయందు ప్రధానం ఇమామ్. ఈ ఇమామ్ పరంపర అలీ ఇబ్న్ అబీ తాలిబ్ (ప్రవక్తగారి అల్లుడు, ఫాతిమా గారి భర్త) నుండి ప్రారంభమైనది. [63][64] సున్నీలు షరియా న్యాయశాస్త్రాలను పాటిస్తే, షియాలు జాఫరి న్యాయశాస్త్రం అవలంబిస్తారు.[65] షియా ఇస్లాం అనేక శాఖలుగా విభజింపబడియున్నది. వీరిలో ప్రధానం ఇస్నా అసరియా (12 ఇమామ్ లను అనుసరించేవారు), మిగతావారు ఇస్మాయీలి, జైదియ్యా లు.[66]



సూఫీ తత్వము:--


సూఫీ తత్వము; ఇస్లాం మతము లో ఒక ఆధ్యాత్మిక ఆచారం ఈ సూఫీ తత్వం. ఈ తత్వం ప్రకారం స్వీయ ఆధ్యాత్మికా మార్గాన ఈశ్వర ప్రేమను పొందడం ధ్యేయం.[67] ఇస్లామీయ ధర్మశాస్త్రాల ప్రకారం షరియా మరియు ఫిఖహ్ లు ఇస్లామీయ ప్రధాన మార్గాలైతే, సాధారణ ముస్లిం సమూహాల ప్రకారం సూఫీ తత్వము ఒక ఉపమార్గము. ఈ సూఫీ తత్వము, దిశ, దశ, దార్శనికత మరియు మార్గ దర్శకత్వము లేని కారణంగా 'గాలివాట మార్గం' గా ముస్లింలు అభివర్ణిస్తారు. మరియు దీనిని ఉలేమాలు, బిద్ అత్ అని కూడా వ్యవహరిస్తుంటారు. ఈ మార్గం, మార్గ దర్శకత్వం లేనికారణంగా, అంధమార్గంగానూ, అంధవిశ్వాసాల మయంగానూ, గమ్యంలేని, స్థిరత్వంలేని మార్గంగానూ అభివర్ణించబడుతుంది. ఇవి అక్షర సత్యాలే, కాని, ఈ తత్వంలోని విశ్వసోదర ప్రేమ మాత్రం శ్లాఘింపదగినది. ఈ సూఫీ తరీఖాలు సున్నీ ఇస్లాం గాని షియా ఇస్లాం గాని కలిగివున్నవే. [68]


ఇతరములు:-

ఖారిజీలు, వీరు ఒక వర్గం వారు, ఇస్లాం ఆవిర్భవించినప్పటినుండి, వీరు వేరుగానే వుంటూ వచ్చారు. ఈ వర్గంలోని కేవలం ఒకే ఒక శాఖ ఇప్పటికి వున్నది, దీనినే ఇబాదిజం అని అంటారు. వీరు ఖురాన్, షరియా, హదీసులు మరియు సున్నహ్ ల పట్ల అంతగా శ్రద్ధ వహించరు. వీరికి ప్రధానం వీరి ఇమామ్. "ఖారిజీ" అనగా "విసర్జించబడిన" లేక 'బాహ్యమైన', వీరు ఇస్లామ్ నుండి బాహ్యంగానే వుంటూ వస్తున్నారు. వీరు ప్రధానంగా ఒమన్ లో వుంటున్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి