20, ఆగస్టు 2010, శుక్రవారం

జుడాయిజం -కొన్ని విశేశాలు

ఇబ్రాహీం ప్రాముఖ్యత:


యూదుల కొరకు ఇబ్రాహీం, పితరుడు, పిత, లేదా తండ్రి. సకలలోకాల ప్రభువు, ఇబ్రాహీం సంతతి యందు అనేక ప్రవక్తలను ప్రకటిస్తాడని సెలవిచ్చాడు. యూదుల ప్రకారం, నోవా (నూహ్) ప్రవక్త కాలంలో జరిగిన మహాప్రళయము తరువాత జన్మించి వారిలో, విగ్రహారాధనను సహేతుకంగా తిరస్కరించిన వారిలో ఇబ్రహీం ప్రప్రధముడు. ఇతనే తరువాత ఏకేశ్వరోపాసక మతాన్ని స్థాపించాడు.
క్రైస్తవులు అబ్రహామును ఆత్మపరమైన పితగా అభివర్ణిస్తారు.[5] క్రైస్తవంలో అబ్రహాము, విశ్వాసానికి ఆదర్శం.[6] మరియు ఇతని యొక్క దేవునికి సమర్పించే గుణం, ఏసుక్రీస్తు యొక్క దేవునికి సమర్పించే గుణంతో పోలుస్తారు.[7]
ఇస్లాంలో, ఇబ్రాహీం, ప్రవక్తల గొలుసు క్రమంలో ఒక ముఖ్యమైన ప్రవక్త, ఈ గొలుసుక్రమం ఆదమ్ తో ప్రారంభం అవుతుంది. ఏకేశ్వరోపాసక విధానాన్ని మరియు తత్వానికి పునరుజ్జీవనం ప్రసాదించినవాడు, అందుకే ఇతన్ని "హనీఫ్" అని వ్యవహరిస్తారు. ఇబ్రహీంను "ప్రవక్తల పిత"గా కూడా అభివర్ణిస్తారు.

భగవంతుడు:


ఇస్లాం మరియు యూద మతము, ఏకేశ్వరవాదాన్ని అవలంబిస్తాయి మరియు ఒకే దేవుణ్ణి (వారి వారి ధర్మగ్రంధాలనుసారం) ఉపాసిస్తాయి. క్రైస్తవం కూడా ఏకేశ్వర ఉపాసనను అంగీకరిస్తుంది, కాని "త్రిత్వం" (దేవుడు, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ) అనుసరిస్తుంది. ఈ వాదాన్ని మొదటి రెండు మతాలు స్వీకరించవు. కానీ ఈ క్రైస్తవసముదాయములోని కొందరు మాత్రం ఈ వాదం (త్రిత్వం) రోమనుల సృష్టి అని, జొరాస్ట్రియన్ మతము మరియు పాగన్ల సాంప్రదాయమని, మూల-క్రైస్తవానికి, ఈ త్రిత్వవాదానికి ఏలాంటి సంబంధం లేదని వాదిస్తాయి.


యూద మతములో భగవంతుడు:


యూద ధార్మికత హెబ్రూ బైబిల్ ఆధారితం. ఈ ధర్మానుసారం దేవుడు మోజెస్ ను ధర్మగ్రంధమైన తోరాహ్ ద్వారా తన ఆదేశాలను మరియు ప్రకృతి సిద్ధాంతాలను అవగతం చేశాడు. "ఎలోహిమ్" అనే పదము దేవునికి ఆపాదింపబడినది. ఇస్లాంలో "ఇలాహి" లాగా

2 కామెంట్‌లు: